Monday, April 29, 2024

మెషీన్ల ద్వారా నాలాల పూడికతీత: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలో మెషీన్ల ద్వారా నాలాల పూడికతీత పనులు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమైనప్పుడు తలసాని మాట్లాడారు. ఇప్పటి దాకా నాలాల పూడికతీత జిహెచ్ఎంసి సిబ్బంది తీశారని, రోడ్లు, ఫుట్ పాత్ లు, పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలో ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర ట్రాఫిక్ సమస్య తీరిపోతుందన్నారు. ఇప్పటికే ఎల్ బి నగర్ దగ్గర ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే పలుచోట్ల ఫ్లైఓవర్లు నిర్మించామని, నాలాలపై ప్రత్యేక దృష్టి పెడుతామని హామీ ఇచ్చారు. నాలాలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, హైదరాబాద్ ను విశ్వనగరంగా అభిృద్ధి చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News