Sunday, June 22, 2025

ఎవి ఇన్‌ఫ్రా భారీ మోసం

- Advertisement -
- Advertisement -

ప్రీ లాంచ్ పేరుతో పలువురి వద్ద వందల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘరానా మోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. ప్రీలాంచ్, అధిక వడ్డీ తదితర హామీలతో 500మంది వద్ద వందల కోట్లు వసూలు చేసిన ఎవి ఇన్‌ఫ్రా కంపెనీపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ మోసం కావడంతో కేసును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…దుర్గం చెరువు సమీపంలో ఎవి ఇన్‌ఫ్రా పేరుతో విజయ్ గోగుల, మరి కొందరు కలిసి కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా ప్రాంతాల్లో వెచర్లు వేశానని ప్రీలాంచ్ పేరుతో ప్రచారం చేశాడు. తక్కువ ధరకు ప్లాట్లు విక్రయిస్తానని చెప్పడంతో దాదాపుగా 500మంది బాధితులు రూ.10లక్షలు నుంచి కోటి రూపాయల వరకు డిపాజిట్ చేశారు. కొందరికి తమ కంపెనీలో పెట్టుబడిపెడితే తక్కువ సమయంలో రెండింతలు లాభాలు ఇస్తామని చెప్పాడు.

ఈ స్కీంలో కూడా చాలామంది లక్షలాది రూపాయలు డిపాజిట్ చేశారు. ఇలా పలు స్కీముల పేరు చెప్పి రూ.500కోట్లు వసూలు చేశాడు. డిపాజిట్లు సేకరించిన నిందితులు ప్రారంభంలో డబ్బులు కట్టిన వారికి వడ్డీ కలిపి ఇచ్చేవారు. కొందరికి డబ్బులు డిపాజిట్ చేసిన 18నెలల తర్వాత కట్టిన డబ్బులకు అదనంగా 50శాతం కలిపి చెల్లిస్తామని చెప్పారు. ఇలా డిపాజిట్ చేసిన బాధితులు గడువు ముగియడంతో డబ్బులు ఇవ్వాలని, ప్రీలాంచ్‌లో డబ్బులు కట్టిన వారు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో నిందితుడు విజయ్ బాధితులకు చెక్కులు ఇచ్చాడు, వాటిని బ్యాంక్‌లో డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి. వెంటనే కార్యాలయానికి బాధితులు రాగా తాళం వేసి ఉంది. దీంతో వెంటనే బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. విజయ్ గోగుల కాల్ డేటా, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News