Sunday, April 28, 2024

ఏసీబీ వలలో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్

- Advertisement -
- Advertisement -

ఎప్పుడూ స్వచ్చంద, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి మీడియాలో ఎదో ఒక రూపంలో దర్శనం ఇచ్చే మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ. 19,200 ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకటేష్ ద్వారా తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు మాటు వేసి బాధితుడు ఫిర్యాదుతో వల పన్ని పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, సీఐ శ్యామ్ సుందర్‌లు తెలిపిన కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి 108 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలం రిజిస్ట్రేషన్ కోసం మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ నెల మొదటి వారంలో వచ్చారు. అయితే గజానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 108 ఉండగా అందుకు గజానికి రూ.200 ఇస్తే రిజిస్ట్రేషన్ ఆవుతుందని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ స్పష్టం చేశారు.

అలా అయితేనే స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ అవుతుందని పేర్కోన్నారు. అయితే అంత డబ్బు రిజిస్ట్రార్‌కు ఇవ్వడానికి ఇష్టపడని హరీష్ వరంగల్‌లోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే శుక్రవారం తమ సూచనల మేరకు తిరిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను ఆశ్రయించి గజానికి రెండు వందలు కాదని రూ. 150 ఇస్తానని చెప్పి బేరమాడాడు.  రూ. 19,200 ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకటేష్‌కు ఇస్తే ఆయనే అన్ని చూసుకుంటాడని తెలిపినట్లు వివరించారు. ఆమె కోరిన డబ్బును సబ్ రిజిస్ట్రార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఆలేటి వెంకటేష్‌కు ఇస్తుండగా తాము రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అలాగే కార్యాలయంలో సోదాలు నిర్వహించడంతో పాటు వెంకట్ వద్ద ఉన్న లెక్కలేని నగదు రూ. 1లక్షా 72 వేల నగదును కూడా స్వాధీనం చేసుకుని సబ్ రిజిస్ట్రార్ తస్లామా మహ్మద్,

ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకటేష్‌లను అరెస్టు చేసి వరంగల్‌లోని ఏసీబీ కోర్టులో వారివురిని హాజరుపర్చనున్నామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు దాడుల సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ దాడుల్లో పలువురు ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News