Thursday, April 25, 2024

మెడ నొప్పితో ఆస్పత్రిలో చేరిన మహారాష్ట్ర సిఎం థాకరే

- Advertisement -
- Advertisement -

Maharashtra CM To Be Hospitalized For Neck Pain

ముంబై : మెడనొప్పికి వైద్య చికిత్స కోసం డాక్టర్ల సలహాపై తాను ఆస్పత్రిలో చేరినట్టు మహారాష్ట్రముఖ్యమంత్రి థాకరే బుధవారం చెప్పారు. కరోనా నివారణ కోసం తాను తన ప్రభుత్వం నిర్విరామంగా గత నెండేళ్లుగా పనిచేస్తున్నామని, ఈ కారణంగా ఈ రెండేళ్లలో కొంత అలక్షం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో రెండు మూడు రోజు చికిత్స పొందితే సరిపోతుందని వైద్యులు సలహా ఇచ్చారన్నారు. అయితే ఆయన ఏ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారో తెలియచేయలేదు. సోమవారం ప్రధాని మోడీతో ఆయన మెడ చుట్టూ కాలర్‌తో వర్చువల్ సమావేశంలో కనిపించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పది కోట్ల డోసులు అందించినప్పటికీ ప్రతివారూ టీకా డోసు పొందాలని ప్రజలకు సూచించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News