Saturday, May 4, 2024

సన్ రైజర్స్ ఆటగాళ్లతో మహేష్ బాబు.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రకంపనలు సృష్టిస్తోంది. పాట్ కమిన్స్ సారధ్యంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ వంటి మెగా టైటిల్స్‌ను ఆస్ట్రేలియాకు అందించిన ఈ స్టార్ ఆటగాడు ప్రస్తుతం సన్‌రైజర్స్‌ను సయితం గెలుపు బాటలో నడిపిస్తున్నాడు.

గత మ్యాచ్‌లో ఢిల్లీ కెపిటల్స్‌పై భారీ విజయాన్ని అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్న సన్ రైజర్స్ ఆటగాళ్లు తాజా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్‌ను కలిసినందకు చాలా ఆనందంగా ఉందని కమిన్స్ ఆ ఫొటోలకు క్యాప్షన్ రాసుకొచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News