Saturday, April 20, 2024

భూతగాదాలు.. పెదనాన్న తలనరికి ఊరేగించిన యువకుడు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: భూ వివాదాలతో పెదనాన్న తల మొండెం వేరుచేసి ఊరేగించిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. స్థానిక సీఐ నోముల వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం… ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన బండమీది చంద్రయ్య(60)కు తమ్ముడి కుమారుడు రాకేష్ అనే యువకుడు పాత కక్షలు, భూ తగాదాలున్నాయి.

వాటిని దృష్టిలో పెట్టుకొని వరుసకు పెదనాన్న అయినా చంద్రన్నను హత్య చేసి తల మొండెం వేరు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటేశం తెలిపారు. తలను మూడు కిలోమీటర్ల మీద తీసుకెళ్లి ఝరాసంగం పెట్రోల్ పంపు వద్ద పక్కన వేయడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తలను తీసుకొని బర్దిపూర్ గ్రామంలో తిరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News