Saturday, April 27, 2024

ఇందల్వాయిలో వ్యక్తి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

నిజామాదాబ్‌ః జిల్లాలోని ఇందల్వాయి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోమవారం మండలంలోని తిర్మన్‌పల్లిలో అక్బర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తిర్మన్‌పల్లి శివారులో కొందరు గుర్తు తెలియని దుండగులు అక్బర్‌ను హత్య చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న ఇందల్వాయి పోలీసులు పరిశీలించారు.

మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News