మంచు విష్ణు నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప‘. ఈ మూవీని ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా విష్ణు మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రానా, బన్నీతోపాటు కొంతమంది టాలీవుడ్ హీరోలకు వాట్సప్ గ్రూప్ ఉందని విష్ణు చెప్పారు. వారి గ్రూప్ లో హీరోయిన్స్ కూడా ఉన్నారని తెలిపారు. తనకు బిడియం ఎక్కువని.. అందుకే ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేశానని విష్ణు వెల్లడించారు. కాగా, ఇటీవల విడుదలైన కన్నప్ప మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక, ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మోహన్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.