Monday, April 29, 2024

అక్షయ్ కుమార్‌పై మరాఠాలు మండిపాటు

- Advertisement -
- Advertisement -

 

 

ఔరంగాబాద్: మరాఠా యోధుల మనోభావాలను కించపరిచేలా వాణిజ్య ప్రకటనలో నటించినందుకు సినీ నటుడు అక్షయ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని ఒక మరాఠా సంస్థ నాందేడ్ జిల్లా పోలీసు అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. ఈ ప్రకటన ద్వారా మరాఠా యోధులను అవమానించారని ఆరోపిస్తూ సంభాజీ బ్రిగేడ్ గురువారం నాందేడ్ జిల్లా కలెక్టర్‌కు, వజీరాబాద్ పోలీసులకు లేఖలు అందచేసింది. నిర్మా వాషింగ్ పౌడర్ ప్రకటనలో నటించిన అక్షయ్ కుమార్ ఇందులో ఒక మరాఠా రాజు పాత్రను పోషించారు. యుద్ధం నుంచి విజయుడై తిరిగి వచ్చిన రాజు తన బట్టలను తానే ఉతుక్కుంటూ శత్రువులను చావకొట్టడమే కాదు బట్టలను ఉతకడమూ మా సైన్యానికి తెలుసు అంటాడు. కాగా, ఈ వాణిజ్య ప్రకటనకు సోషల్ మీడియాలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాయ్‌కాట్ నిర్మా హ్యాష్‌ట్యాగ్‌తో టిట్టర్‌లో ట్వీట్లు ట్రెండ్ అవుతున్నాయి.

 

 

Maratha group asks police to register case on Akshay, Nirma washing powder advertisement creates controversy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News