Saturday, July 27, 2024

భూముల మార్కెట్ విలువల సవరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠినచర్యలు చేపట్టాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పె రిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహారించాలన్నారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. గతేడాది వచ్చిన
ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి కొన్ని శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా ఆదాయ పెంపును సమీక్షించుకోవాలని ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. బడ్జెట్‌లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతినెలా టార్గెట్‌ను నిర్ధేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను సిఎం రేవంత్ ఆదేశించారు.

జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి
ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ విజిట్‌ను అధికారులు చేయాలని, ఆడిటింగ్ నిరంతరం జరగాలని సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని సిఎం రేవంత్ ఆదేశించారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని, జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహారించాలని అధికారులను రేవంత్ హెచ్చరించారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ఎందుకు తగ్గింది..?
గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్‌లో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలపై సిఎం ఆరా తీశారు. అక్రమంగా మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయి. కానీ, అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చే ఆదాయం ఎందుకు పెరగలేదని ఈ సందర్భంగా సిఎం రేవంత్ అధికారులను ప్రశ్నించారు. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ, విక్రయాల ధరలకు పొంతన లేకపోవటం ప్రధాన కారణమని అధికారులు సిఎంతో పేర్కొన్నారు.
ఎక్కడెక్కడ, ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి…
గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని, ఇప్పటికీ చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని అధికారులు సిఎం రేవంత్‌తో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుందని, ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఎక్కడెక్కడ, ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌లు దేనికి ఎంత సవరించాలన్నది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, స్టాంపులు రిజిస్ట్రేషన్ విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలని సిఎం చెప్పారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని ముఖ్యమంత్రి సూచించారు.
మోడల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను నిర్మించండి…
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేర ఉంది, ప్రస్తుతం దానిని తగ్గించాలా, పెంచాలా అన్న విషయాలను కూడా అధ్యయనం చేయాలని సిఎం రేవంత్ సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఇప్పటికే చాలాచోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయని, రిజిస్ట్రేషన్లకు వచ్చే వాళ్లు ఇప్పటికీ చెట్ల కింద నిలబడే ఉంటున్నారని అధికారులు సిఎం దృష్టికి తీసుకెళ్లారు. పబ్లిక్ యుటిలిటీకి సేకరించిన స్థలాలను గుర్తించి కొన్నిచోట్ల అధునాతనంగా మోడల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు నిర్మించాలని, అందుకు సన్నాహాలు చేయాలని సిఎం అధికారులకు సూచించారు.
ఇసుక కొరత రాకుండా చూడాలి
సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలని ఆదేశించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News