- Advertisement -
ఖమ్మం:జిల్లాలోని రఘునాథపాలెం మండలానికి చెందిన వివాహితపై గ్యాంగ్ రేపుకు పాల్పడిన కేసులో ఏడుగురి నిందితులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. గత శుక్రవారం రాత్రి ఇంట్లో పడుకున్న బాధితురాలిని ఇద్దరు వ్యక్తులు తాళ్లతో బంధించి మిగతావారికి సమాచారం అందించారు. అనంతరం ఏడుగురు నిందితులు కలిసి ఆమెను హర్య తండా సమీపంలోని పత్తి చేనులోకి ఎత్తికెళ్లి సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Married Woman gang raped by Seven Men in Khammam
- Advertisement -