Sunday, April 28, 2024

కుటుంబ కలహాలతో కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ శివారు వెంకటాపురంనకు చెందిన ఆకుల లావణ్య (28) కుటుంబ కలహాలతో తన కూతురు ఆకుల నిత్య (8) కుమారుడు ముఖేష్ (10) లను బావిలో వేసి తను దూకి ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘటనలో తల్లి కూతురు మృతి చెందగా, కుమారుడు ముఖేష్ కు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News