Saturday, April 20, 2024

ఎంబిబిఎస్ ఫైనలియర్ పరీక్షా ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంబిబిఎస్ ఫైనలియర్ పరీక్షల ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన ఎంబిబిఎస్ చివరి సంవత్సరం (పార్ట్ -2) రెగ్యులర్ పరీక్షల్లో 92.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

వీరిలో 43 మంది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులు కాగా.. 1,300 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 3,046 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వై.మల్లేశ్వర్ తెలిపారు. ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www. knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడచ్చని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News