Sunday, May 5, 2024

ఇవాళ మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా ఉప్పల్ వేదికంగా గురవారం రాత్రి 7.30 గంటలకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్- హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో ఉప్పల్ మార్గంలో ప్రయాణించే మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు. అర్ధరాత్రి 12.15 గంటలలకు చివరి రైలు ఉంటుందని, గమ్యస్థానానికి 1.10 గంటలకు చేరుకుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఉప్పల్ స్టేడియం, ఎన్‌జిఆర్‌ఐ స్టేషనలో మాత్రమే ప్రవేశానికి అనుమతి ఇస్తామని, మిగితా స్టేషన్లలో మూసివేస్తామని చెప్పారు. ఉప్పల్ మార్గంలోని మిగితా స్టేషన్లలో నిష్క్రమణలకు అనుమతి ఇస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News