Thursday, March 28, 2024

హెచ్‌యూజే 2023 డైరీ ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జర్నలిస్టుల హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర, వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హెల్త్ స్కీం, ఇళ్ల స్థలాల సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉందని అందరికీ మేలు జరిగేలా సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ యూనియన్ అఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే, టిడబ్ల్యూజేఎఫ్ ) 2023 సవంత్సరం డైరీని మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు గురువారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో జర్నలిస్టుల హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో అనుమతించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆవిష్కరణలో హెచ్‌యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీష్ , కోశాధికారి రాజశేఖర్, ఉపాధ్యక్షుడు రమేష్ , జాయింట్ సెక్రటరీ క్రాంతి, టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, ఈసీ మెంబర్ రామకృష్ణలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News