Wednesday, April 24, 2024

పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా కామెంట్స్

- Advertisement -
- Advertisement -

Minister Roja comments on Pawan Kalyan

తిరుపతి: వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన ఘాటు ట్వీట్లపై ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆరు నెలలు నిద్రపోయి.. ఆరు నెలలు మెలుకువ ఉండే కుంభకర్ణుడన్నారు. టిడిపి హయాంలో ఉత్తరాంధ్ర ప్రజల వలసలను పవన్ కల్యాణ్ చూడలేదని, బిజెపితో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు పవన్ కల్యాణ్ ఏం చేశారని మంత్రి రోజా ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ విశాఖ గర్జనపై పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News