Monday, May 13, 2024

కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన నవాబుపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ భరత్‌భూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కడిచెర్ల గ్రామానికి చెందిన లావణ్య మాధవుల దంపతుల కుమార్తె నిహరిక కొం తకాలంగా కడుపునొప్పితో బాధపడుతుంది. అయితే అదివారం కడుపునొప్పి తీవ్రతరం కావడంతో ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News