Tuesday, April 23, 2024

సర్పంచ్ నవ్య ఇంటికి చేరుకున్న రాజయ్య

- Advertisement -
- Advertisement -

వరంగల్: బిఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశం, నవ్య భర్త ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చామని ఎంఎల్‌ఎ రాజయ్య తెలిపారు. ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామానికి ఎంఎల్‌ఎ రాజయ్య చేరుకున్నారు. జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్వ ఇంటికి చేరుకొని వారితో ఎంఎల్‌ఎ రాజయ్య మాట్లాడారు. బిఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం తనకు పలు సూచనలు చేసిందని, అందరూ కలిసి పని చేయాలని అధిష్టానం సూచించిందని రాజయ్య తెలిపారు. ఎంఎల్‌ఎ రాజయ్య తనని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నవ్వ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సర్పంచ్ నవ్య ఇంటి వద్దకు పోలీసులు బిఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News