Thursday, May 2, 2024

దాతృత్వం చాటుకున్న ఎంఎల్ఎ సతీమణి

- Advertisement -
- Advertisement -

బోధన్ ః బోధన్ ఎంఎల్ఎ షకీల్ సతీమణి అయేషా ఫాతిమ తన దాతృత్వం చాటుకున్నారు. ముగ్గురు పిల్లలకు ఒకే కాన్పులో జన్మించిన ఓ తల్లికి అండగా నిలిచి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. వివరాలలోకి వెళితే.. పట్టణంలోని రాకాసిపేట్‌కు చెందిన నరేష్ అనిత దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు సంతానం కలిగారు.

పేదవారు కావడంతో ఎంఎల్ఎ షకీల్ సతీమణికి సమస్యను వివరించారు. ఆమె వెంటనే స్పందించి సుమారు లక్ష రూపాయలు విలువైన పాల పౌడర్‌ను అందజేశారు. ఎంఎల్ఎ సతీమణికి ఈ ఇద్దరు దంపతులు కృతజతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News