Sunday, May 19, 2024

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

వడ్డేపల్లి : వడ్డేపల్లి మున్సిపాలిటీలో పైపాడులో రూ. 50 లక్షలతో సిసి రోడ్ నిర్మాణ పనులకు , శాంతినగర్‌లో రూ.28 లక్షలతో సిసి రోడ్ డ్రైనేజీ పనులకు , రూ.16 లక్షలతో డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే డా.వి. ఎం.అబ్రహం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డేపల్లి మున్సిపాలీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, పట్టణంలో పారిశుధ నివారణకు ప్రత్యేక చర్యలు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి,

వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని , పట్టణాలు అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమని, సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్‌లు , వైస్ చైర్మన్‌లు , కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News