Friday, April 26, 2024

మునుగోడు గడ్డమీద ఎగిరేది గులాబీ జెండానే

- Advertisement -
- Advertisement -

MLC Banda prakash comments on munugode bypoll

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ విజయం ఖాయమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని కొంపల్లి కాటన్ మిల్లులో కొంపల్లి ఎంపిటిసి పరిధిలోని ముదిరాజ్ మహాసభ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముదిరాజ్‌ల మోహంలో వెలుగులు చూడాలన్నదే సిఎం కెసిఆర్ లక్షమన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రజలకు ద్రోహం చేశాడన్నారు. మూడున్నర ఏండ్లుగా ఏమి చేయలేని వ్యక్తి గెలిచి ఏం సాధిస్తాడని ఎద్దేవా చేశారు. ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ… 2015నుండి ముదిరాజ్‌లకు చేపపిల్లలను ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌ది అన్నారు. గతంలో ముదిరాజ్‌లకు పట్టించుకునేవారులేక అనేకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సిఎం కెసిఆర్ చొరవతో ఈ రోజు ముదిరాజ్‌లు అభివృధ్ది చెందుతున్నారని తెలిపారు. అంతకుముందు కొంపల్లి గ్రామంలో కోలాటాలు, బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తెరాస రాష్ట్ర నాయకులు కంచెర్ల కృష్ణారెడ్డి, నారబోయిన రవి ముదిరాజ్, జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ బోళ్ల వెంకట్ ముదిరాజ్, సూర శంకర్, నారగోని నరసింహ, గ్రామశాఖ అధ్యక్షుడు బోయపర్తి సురేందర్, బోయపర్తి సైదులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News