Friday, April 19, 2024

దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణం: ఎంఎల్ సి కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సిఎం కెసిఆర్ దూరదృష్టి, పట్టుదల, నిబద్ధతే బిఆర్‌ఎస్ పార్టీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన బిఆర్‌ఎస్ పార్టీ అనేక రాజకీయ ఒడిదుడుకులను తట్టుకొని, ప్రతి పౌరుడి మద్ధతుతో లక్ష్యాన్ని సాధించిందని ఆమె తెలిపారు. సిఎం కెసిఆర్ రాజనీతిజ్ఞతతో ఏర్పడిన తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు.

Also Read: అట్టహాసంగా ఢిల్లీలో బిఆర్‌ఎస్ భవన్ ప్రారంభోత్సవం

తొమ్మిది మంది లోక్‌సభ ఎంపిలు, ఏడుగురు రాజ్యసభ ఎంపిలు, 105 మంది ఎమ్మెల్యేలతో బిఆర్‌ఎస్ పార్టీ జాతీయస్థాయిలో కీలక పార్టీగా ఎదిగిందని కవిత ట్వీట్ చేశారు.కెసిఆర్ నిబద్ధతను మెచ్చి ప్రత్యేక తెలంగాణకు 39 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని, సిఎం కెసిఆర్ రాజనీతిజ్ఞతతో ఏర్పడిన తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News