Friday, April 26, 2024

మల్లికార్జున స్వామి ఆలయంలో మొక్కలు నాటిన ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

MP santhosh kumar planted plants in Mallanna temple

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఐనఓలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు . వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఎంపి సంతోష్ ఆదివారం ఉదయం హనుమకొండ జిల్లా ఐనఓలు మండలం లోని మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకొని, ఆలయ ప్రాంగణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంఎల్‌ఎ ఆరురి రమేష్, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News