- Advertisement -
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికి బిసిసిఐ ఝలక్ ఇచ్చింది. బిసిసిఐ ప్రకటించిన 2019-2020 కాంట్రాక్టు లిస్టులో ఏ కేటగిరీలోనూ ధోనీ పేరు లేదు. (ఎ+) జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాపేర్లు ఉన్నాయి. వారికి రూ7 కోట్ల పారితోషికం అందనుంది. అటు కేఎల్ రాహుల్ (బి) జాబితా నుంచి (ఎ) జాబితాలోకి ప్రమోట్ అయ్యాడు. అయితే బిసిసిఐ ప్రకటించిన జాబితాలో ధోనీ పేరు లేకపోవడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్రకటించని ధోనీని బిసిసిఐ ఘోరంగా అవమానించిందని నెట్టింట్లో నెటిజన్లు బిసిసిఐపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ పరిమాణాల నేపథ్యంలో ఎమ్ఎస్ ధోనీ రిటైర్మెంట్ ఖాయమనిపిస్తోంది.
MS Dhoni dropped from BCCI list
- Advertisement -