Sunday, May 12, 2024

బిఆర్‌ఎస్ గూటికి నందికంటి శ్రీధర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో మేడ్చల్ – మల్కాజిగిరి డిసిసి ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్
చేరారు. నందికంటి శ్రీధర్ వెంట భారీ ఎత్తున కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిన తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరా లన్న పెద్ద నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వచ్చిన శ్రీధర్‌కు స్వాగతం పలుకుతున్నామన్నారు. జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఆయనకు అక్కడ అన్యాయం జరగడంతో ఆయన బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. పది సంవత్సరాలు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డామన్నారు. తమకు అవకాశం ఇచ్చిన ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పని చేశామని వెల్లడించారు.

గత పది సంవత్సరాలు హైదరాబాద్ నగరం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో, ఏ విధంగా అభివృద్ధి అయిందో గుర్తించాలన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మరింతగా పనిచేస్తామని వెల్లడించారు. నందికంటి శ్రీధర్ కి కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది బిఆర్‌ఎస్‌లో ఆయనకు, ఆయన రాజకీయ సేవలకు తగిన గౌరవాన్ని కల్పిస్తామని భరోసానిచ్చారు. పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న శ్రీధర్ చెప్పిన మాట తనకు బాగా నచ్చిందని, శ్రీధర్ పార్టీ కోసం అత్యంత నిబద్ధతతో పనిచేసే వ్యక్తి అని, అంతే నిబద్దతతో బిఆర్‌ఎస్ కోసం కూడా పనిచేస్తాను అని తెలిపారన్నారు. తనతో పాటు బిఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు, కార్యకర్తలకు కూడా సరైన అవకాశాలు ఇచ్చే బాధ్యతను తీసుకోవాలని శ్రీధర్ కోరారని, శ్రీధర్ అడిగిన మేరకు బుధవారం బిఆర్‌ఎస్‌లో చేరిన శ్రీధర్ అనుచరులను కాపాడుకుంటాం, సరైన విధంగా గౌరవించుకుంటామని కెటిఆర్ అన్నారు. తమకు ఉన్న హై కమాండ్, నాయకులు కెసిఆర్ ఒక్కరు మాత్రమేనన్నారు.

ఆయన ఆదేశాలు సూచన మేరకు మాత్రమే పార్టీ పని చేస్తుంది. మాకు ఢిల్లీలో బాసులు లేరని కెటిఆర్ అన్నారు. బుధవారం చేరిన నందికంటి శ్రీధర్, కాంగ్రెస్ శ్రేణులు కలిసి పనిచేసి మల్కా జిగిరిని గెలిపించుకుంటారన్న నమ్మకం విశ్వాసం తనకు ఉన్నదన్నారు. నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో కష్టపడి పని చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీలో బిసిలకు స్థానం లేదని అర్థం అయిన తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెమట, రక్తం ధారాపోసినా తమకు స్థానం లేకుండా పోయిందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మద్దతు ఇస్తున్న అభివృద్ధికి పాటుపడుతున్న సిఎం కెసిఆర్ నాయకత్వంలో పని చేసేందుకు తామంతా బిఆర్‌ఎస్‌లో చేరామని, మల్కాజిగిరి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. నిద్రాహారాలు మాని అయినా సరే మైనంపల్లి హనుమంతరావుని ఓడించి, మల్కాజిగిరిలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామన్నారు. అభ్యర్థి ఎవరైనా బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకునే దిశగా పనిచేస్తామని పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News