Monday, April 29, 2024

ప్రారంభానికి సిద్ధమైన సిద్ధిపేట వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సిఎం కెసిఆర్ దార్శనిక నాయకత్వంలో తెలంగాణ తెల్లకోటు విప్లవానికి లోనవుతోందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేటలో వెయ్యి పడకల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందన్నారు. ఇది సిద్దిపేట ప్రజలకు వైద్య రంగంలో కొత్త ఊపిరి పోస్తోందని వెల్లడించారు. ప్రాంతీయ ఆసుపత్రిలో అన్ని వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్య క్రమాన్ని గురువారం తాను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రథమ చికిత్స నుంచి క్రిటికల్‌కేర్ వరకు అన్నీ సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. సిద్దిపేట వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరోగ్య సిద్దిపేట కోసం కృషి చేసి చివరికి ఆరోగ్య తెలంగాణ లక్షాన్ని ముద్దాడ నుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News