Sunday, May 5, 2024

నయవంచన అంటే ఇదే రేవంత్ రెడ్డి: రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

పెన్షన్ రూ. 4 వేలు చేస్తానని ఓట్లేయించుకున్నావు

ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు

దేశంలో పేద ప్రజలను వంచించిన పార్టీ కాంగ్రెస్

సిద్దిపేట:  ‘రూ.2 వేలుగా ఉన్న పెన్షన్‌ను ఓట్ల కోసం రూ.4 వేలు చేస్తానని చెప్పి… ఓట్లేయించుకున్న తర్వాత హామీ నెరవేర్చకుండా… ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి చేసింది నయవంచన’ అని మెదక్ లోక్ సభ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో గురువారం  నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ… ఈరోజు గాంధీ భవన్‌లో ‘నయవంచన’ అంటూ బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి బిజెపిపై విమర్శలు గుప్పించాడని… కానీ నయవంచన పదానికి పర్యాయపదమే ‘కాంగ్రెస్’ అన్నారు. ప్రజలను మోసం చేసిన మీది నయవంచన కాదా? అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలోని మెజార్టీ ప్రజలను వంచించింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. భారత్‌లో ఇద్దరు ప్రధానులు… ఇద్దరు, రెండు జెండాలు ఉంటాయని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ అన్నారు.  ‘నేను సిద్దిపేట గడ్డమీది నుంచి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా…   డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని చెప్పావు… కానీ అయిందా? ఇప్పటి వరకు కాలేదు. దీనినే నయవంచన అంటారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసి నాలుగు నెలలు అయినా రుణమాఫీ చేయలేదు చూడు.. దీనిని నయవంచన అంటారు రేవంత్ రెడ్డిగారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.  వేల పెన్షన్ ఇస్తానని ఇప్పటికీ ఇవ్వలేదని…  దీనినే నయవంచన అంటారన్నారు. ఈ దేశంలో పేద ప్రజలను వంచించిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు.

పేదింటి ఆడబిడ్డకు రూ. 2500 ఇస్తామని చెప్పారు… ఈరోజు వరకు దానిని ఇవ్వలేదని,  ఇదే నయవంచన అని ఎద్దేవా చేశారు. బిజెపి మాత్రం ప్రజలను ఎప్పుడూ మోసం చేయలేదన్నారు. కాంగ్రెస్ మాట్లాడితే హామీ అంటారని… కానీ మోడీ మాత్రం గ్యారెంటీ అంటారని పేర్కొన్నారు.

ఇటీవల రేవంత్ రెడ్డి మెదక్ వచ్చినప్పుడు ఏదిపడితే అదే మాట్లాడారని మండిపడ్డారు. తనకు ఇక్కడ గడీలు ఉన్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారని… కానీ మా అమ్మానాన్న ఉండే గడీలను రేవంత్ రెడ్డి పేరిట రాసిచ్చేందుకు సిద్ధమని తాను అప్పుడే చెప్పానన్నారు. రైతువేదిక, వైకంఠధామం… ఇలా అన్నింటికి డబ్బులు ఇచ్చింది మోడీయే అన్నారు. మోసం, నయవంచనకు పర్యాయపదం కాంగ్రెస్ అన్నారు. మెదక్‌లో తన గెలుపును ఆపేందుకు రేవంత్ రెడ్డి, హరీశ్ రావులు ఒక్కటై విమానాల్లో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారి కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. మెదక్ జిల్లాకు మోదీ ఏం చేశారో చెప్పేందుకు తాను సిద్ధమన్నారు. అంతేకాదు మోడీ ఇచ్చిన నిధులకు సంబంధించి తాను పుస్తకాన్ని టైప్ చేయించి సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ చేశానన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News