Saturday, July 27, 2024

ఆర్‌టిసి బస్సులో ప్రయాణికుడు గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆర్‌టిసి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా వేంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….కావలి చెందిన రాజశేఖర్ రెడ్డి కడప జిల్లా వేంపల్లిలో బస్సు ఎక్కాడు. బస్సు కొంచెం దూరం వెళ్లిన తరువాత అతడు స్పృహతప్పి బస్సులో పడిపోవడంతో మరొక ప్రయాణికుడు కండక్టర్‌కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బందికి కండక్టర్ సమాచారం ఇవ్వడంతో రాజశేఖర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గుండెపోటుతోనే చనిపోయి ఉంటాడని వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News