Saturday, May 18, 2024

ఉద్యోగం ఇస్తే రూ. 41 వేలు చెల్లిస్తా

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికీ ఊరికే ఉద్యోగం రాదు. కంపెనీల యజమానులు ఎవరూ ఇంటి తలుపు తట్టి జాబ్ ఇవ్వరు. అందుకే తనకు నచ్చిన సంస్థలో ఉద్యోగం కోసం ఒక నిరుద్యోగి వినూత్నంగా ప్రయత్నించాడు. తనకు ఉద్యోగం ఇస్తే 500 డాలర్లు (సుమారు రూ. 41 వేలు) ఇస్తానని ఏకంగా కంపెనీ యజమానికే అతను మెసేజ్ పంపాడు. తనను ఆకట్టుకున్న ఆ మెసేజ్‌ను సంస్థ యజమాని ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. బెంగళూరుకు చెందిన వింగిఫై సాఫ్ట్‌వేర్ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ పారస్ చోప్రాకు ఇటీవల ఒక నిరుద్యోగి నుంచి అనూహ్య రీతిలో మెసేజ్ వచ్చింది. వింగిఫైలో తనకు ఉద్యోగం ఇస్తే డబ్బు ఇస్తాననేది ఆ సందేశం సారాంశం. ఆ మెసేజ్‌ను ఆయన నెటిజన్లతో పంచుకున్నారు. అందులో ఏమి రాసి ఉంది అంటే& ‘నాకు వింగిఫైలో పని చేయాలని ఉంది.

మీ కోసం నేను ఒక ప్రత్యేక ప్రతిపాదన చేస్తున్నా. నన్ను ఉద్యోగంలోకి తీసుకుంటే మీకు 500 డాలర్లు ఇస్తా. సంస్థలోని ఉత్తమ ఉద్యోగుల్లో ఒకడిగా నన్ను నేను నిరూపించుకోకపోతే మీరు నన్ను తొలగించండి. ఆ డబ్బు మీ దగ్గరే పెట్టుకోండి. ఇలా చెప్పడం ద్వారా మీ టీమ్ సమయాన్ని వృథా చేయాలని అనుకోవడం లేదు’ అని ఆ నిరుద్యోగి పేర్కొన్నాడు. ‘మీరు నా ప్రతిపాదనను తిరస్కరిస్తారని ఆశిస్తున్నా’ అంటూ అతను తన మెసేజ్‌ను ముగించాడు. అయితే, డబ్బు తీసుకునే ఉద్దేశం తనకు లేనప్పటికీ ఆ నిరుద్యోగి తెగింపు తనను ఆకట్టుకుందని పారస్ చోప్రా తెలిపారు. ‘కంపెనీ దృష్టిని ఇలా ఆకర్షించాలి’ అని ఆయన పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ వెంటనే వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన కొద్ది సేపటికే దానికి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే, నెటిజన్లు మాత్రం ఆ నిరుద్యోగి ప్రతిపాదనపై రకరకాలుగా స్పందించారు. ఆ మెసేజ్ అతని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోందని కొందరు అభిప్రాయపడ్డారు. కాని మరి కొందరేమో అటువంటి మెసేజ్‌లతో హైరింగ్ మేనేజర్లను ఆకర్షించాలని అనుకోవడం సరి కాదు అని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News