Thursday, May 2, 2024

ఆ టీడీపీ కార్యకర్త ఎంత పని చేశాడంటే…

- Advertisement -
- Advertisement -

నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవలే వైసీపీనుంచి టిడిపిలో చేరిన లావు శ్రీకృష్ణ దేవరాయలకు టికెట్ లభించడంతో టిడిపి కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నియోజకవర్గంనుంచి పార్లమెంటు టికెట్ ను అరవింద్ బాబు ఆశిస్తున్నారు. ఆయనకు కాకుండా కృష్ణదేవరాయలకు టికెట్ ఇవ్వడంతో ఆగ్రహించిన పార్టీ కార్యకర్త రాంరెడ్డి బుధవారం అందరూ చూస్తుండగా పురుగుల మందు తాగారు. వెంటనే తోటి కార్యకర్తలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. అరవింద్ బాబుకు రాంరెడ్డి ప్రధాన అనుచరుడని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News