Thursday, May 1, 2025

ఢిల్లీలో రూ. 2000 కోట్ల స్కామ్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ మెడకు మరొక అవినీతి కేసు చుట్టుకున్నది. ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పాఠశాలలు, క్లాస్‌రూమ్‌ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఆరోపించింది, ఆప్ హయాంలో మొత్తంగా 12 వేల స్కూళ్లు, క్లాస్‌రూమ్‌ల నిర్మాణం చేపట్టగా అందులో రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగిందని ఎసిబి తేల్చింది. దీనిపై నాటి ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌లపై ఎసిబి కేసు నమోదు చేసింది. ఎసిబి ఆరోపిస్తున్న ప్రకారం, ఆప్ ప్రభుత్వంలో మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించడంతో పాటు విద్యా శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు, సత్యేంద్రజైన్ పిడబ్లుడి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఆప్ హయాంలో మొత్తంగా 12748 క్లాస్‌రూమ్‌లు నిర్మించారు, ఆ పనులకు సంబంధించిన కాంట్రాక్గులు దక్కించుకున్నవారిలో ఎక్కువ మంది ఆప్‌తో సంబంధం ఉన్నవారేనని ఎసిబి ఆరోపించింది. నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయలేదని, దానిలో కాంట్రాక్ట్ వ్యయం ఏకంగా ఐదు రెట్లు పెరిగిందని ఎసిబి తెలిపింది. ఆ నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సివిసి) కూడా నివేదిక ఇచ్చిందని, అయితే, ఆ నివేదికను ఆప్ సర్కార్ మూడు సంవత్సరాల పాటు తొక్కిపెట్టిందని ఎసిబి ఆరోపించింది. క్లాస్‌రూమ్‌ల నిర్మాణ వ్యయం దాదాపుగా మూదు రెట్లు పెరగడంపై భారతీయ జనతాపార్టీ (బిజెపి) నేతల ఫిర్యాదుతో ఆ వివరాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. ఢిల్లీ ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహించిన ఆ ఇద్దరూ కొంత కాలంగా పలు ఆరోపణలపై చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో సిసోడియా, మనీ లాండరింగ్ ఆరోపణలపై సత్యేందర్ జైన్ జైలుకు వెళ్లివచ్చారు. ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారిపై తాజా ఆరోపణలు, కేసు నమోదు కావడం ఆప్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News