రాష్ట్రంలో రాగల మూడు రోజులలో వాతావరణంలో భిన్నమైన మార్పులు ఏర్పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు రోజులు పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం తేలికపాటి వర్షాలు కురవగా, గురువారం సైతం ఈ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రానున్న నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణంలోని మార్పులను గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కాగా, రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడం, మధ్యాహ్నం నుంచి సాయంత్ర వరకు పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.