- Advertisement -
న్యూఢిల్లీ: మండోలి జైలులో తనను కొట్టిన ఇద్దురు పోలీసు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ నిర్భయ దోషులల్లో ఒకరైన పవన్ గుప్తా ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. జైలులో ఇద్దరు పోలీసులు తన తలపై కర్ర, పిడికిలితో దెబ్బలు కొట్టారని, దీంతో తన తలకు తీవ్ర గాయాలయ్యాయని దోషి పవన్ గుప్తా ఆరోపించాడు. ఈఘటనపై సమాధానాన్ని కోరుతూ మండోలి జైలు అధికారులకు కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మార్చి 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు నలుగురు నిర్భయ దోషులను తీహార్ జైలులో ఉరితీయనున్న విషయం తెలిసిందే.
Nirbhaya Convict Pawan Seeks FIR Against Two Policemen
- Advertisement -