Monday, April 29, 2024

లోక్‌సభ మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

- Advertisement -
- Advertisement -

మొదటి దశకు నోటిఫికేషన్ జారీ
ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్
102 పార్లమెంటరీ సీట్లకు ఎన్నికలు
న్యూఢిల్లీ: ఇరవై ఒక్క రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో అక్కడ నామినేషన్ ప్రక్రియ బుధవారం మొదలైంది. ఆ స్థానాలలో ఏప్రిల్ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి తరఫున ఎన్నికల కమిషన్ (ఇసి) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 27. అయితే, ఒక పండుగ కారణంగా బీహార్‌లో మొదటి దశ ఎన్నికలు జరగనున్న లోక్‌సభ సీట్లకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 28. బీహార్‌లోని 40 సీట్లలో నాలుగింటికి మొదటి దశలో వోటింగ్ జరుగుతుంది. నామినేషన్ పత్రాల పరిశీలన ఈ నెల 28న జరుగుతుంది.

బీహార్‌లో మాత్రం 30న నామినేషన్ పత్రాలు పరిశీలిస్తారు. నామినేషన్ పత్రాల ఉపసంహరణకు చివరి తేదీ 30, కాగా బీహార్‌లో అందుకు గడువు ఏప్రిల్ 2. 18వ లోక్‌సభకు ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలవుతాయి. తదుపరి దశలు 26, మే 7, 13, 20, 25, జూన్ 1 తేదీలలో జరుగుతాయి. వోట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహిస్తారు. మొదటి దశలో పోలింగ్ జరగనున్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News