ఖైబర్ పఖ్తున్ఖా ప్రాంతంలో మరో పోలియో వైరస్ కేసు నమోదయిందని, దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 13కి చేరుకుందని పాకిస్థాన్ అధికారులు శుక్రవారం ధృవీకరించారు. ట్యాంక్ జిల్లాలోని యూనియన్ కౌన్సిల్ అమఖేల్కు చెందిన 18 నెలల చిన్నారిలో ఈ కేసు కనుగొనబడిందని జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్ఐహెచ్)లోని పోలియో నిర్మూలనకు సంబంధించిన ప్రాంతీయ రిఫరెన్స్ లాబొరేటరీ పత్రికా ప్రకటనలో తెలిపింది.
ప్రపంచంలో పోలియో ఉన్న రెండు దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. మరొకటి ఆఫ్ఘనిస్థాన్. పోలియో అనేది అత్యంత అంటువ్యాధి, నయం చేయలేని వ్యాధి, ఇది జీవితాంతం పక్షవాతానికి కారణమవుతుంది. ‘ప్రతి క్యాంపెయిన్లో ఐదు సంవత్సరాల లోపు ప్రతి శిశువుకు పోలియో వ్యాక్సిన్ను పదే పదే ఇవ్వడం, అవసరమైన అన్ని రోగనిరోధకతలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా మాత్రమే సమర్థవంతమైన రక్షణ ఈ వ్యాధి నుంచి లభిస్తుంది’ అని ప్రకటన తెలిపింది.