Thursday, May 15, 2025

భారతీయ పౌరులు వాఘా బార్డర్ దాటేందుకు అనుమతించిన పాకిస్థాన్

- Advertisement -
- Advertisement -

పహల్గాం ఉగ్ర సంఘటన జరిగిన తర్వాత భారత్ వీసాలు రద్దు చేసింది. వాఘా సరిహద్దులో చిక్కుబడిపోయిన భారతీయ పౌరులు వాఘా దాటి వెళ్లేందుకు పాకిస్థాన్ శుక్రవారం అనుమతించింది. అట్టారి, వాఘా సరహద్దులు ఇండియాలోని అమృత్‌సర్, పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్నాయి. ఈ సరిహద్దును పాకిస్థాన్ ఏప్రిల్ 30 వరకు తెరిచి ఉంచి తర్వాత మూసేసింది. దాంతో దాదాపు 70 మంది పాకిస్థాన్‌లు గురువారం స్వదేశంలోకి వెళ్లలేక సరిహద్దు వద్ద చిక్కుబడిపోయారు. ఇండియా వదిలి వెళ్ళేందుకు విధించిన గడువు ఒక రోజు ముందే ముగిసిపోవడం వల్ల సరిహద్దులో పాకిస్థాన్ తన వైపు గేట్లు తెరువలేదు.

ఇండియా వైపు అట్టారి బార్డర్‌లో పాకిస్థాన్ పౌరులు చిక్కుబడిపోయారన్న విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒప్పుకున్నట్లు మీడియా తెలిపింది. మున్ముందు కూడా పాకిస్థాన్ పౌరులు దేశంలోకి తిరిగివచ్చేందుకు వాఘా సరిహద్దు గేట్లను తెరిచి ఉంచనున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదంతో దేశానికి సవాళ్లు సృష్టిస్తుండడంతో ఇండియా… పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పౌరులు ఇండియా వదిలివెళ్లాలంటూ ఇండియా అయితే నోటీసులు జారీచేసింది. గడువు ముగిశాక పాకిస్థాన్ నుంచి గానీ, ఇండియా నుంచి గానీ ఎవరూ సరిహద్దు దాటకుండా నిబంధనలు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News