- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ముల్లాన్పూర్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో(PBKS) జరుగుతున్న తొలి క్వాలిఫయర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో101 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బ్యాటర్లలో మార్కస్ స్టాయినిస్(26), ప్రభ్ సిమ్రన్ సింగ్(18), ఒమర్జాయ్(18) పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో సుయాంశ్ శర్మ 3, జోష్ హేజిల్ వుడ్ 3, యశ్ దయాళ్ 2, భువనశ్వర్ కుమార్ , రొమారియో షెఫర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
- Advertisement -