Friday, April 26, 2024

మందు బాబులకు జరిమానాలు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎనిమిది మందికి రూ. 17వేల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు. గత నాలుగు రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీఓ, రాజీవ్ రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేయగా ఎనిమిది మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రిత్ ఎనలైజర్‌తో తనిఖీ చేయగా మద్యం సేవించినట్లు రిపోర్టు వచ్చిందన్నారు. దీంతో సిద్దిపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రమేశ్‌బాబు మందు హాజరు పరుచగా, విచారణ చేసి రూ.17 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహానాలు నడపాలని వాహనదారులకు సీఐ సూచించారు. ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడతామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News