Sunday, April 28, 2024

అవినీతి సొమ్ము కక్కిస్తాం.. ఇది మోడీ గ్యారంటీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌పై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై శుక్రవారం మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వెనక్కు రప్పిస్తామని, ఇది మోడీ గ్యారంటీ అంటూ ఎక్స్ వేదికగా అవినీతికి పాల్పడే వారిపై మోడీ స్పందించారు. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపి ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందిన ఒక వ్యాపార సంస్థకు చెందిన వేర్వేరు ప్రదేశాల నుంచి రూ. 200 కోట్ల నగదును ఆదాయం పన్ను స్వాధీనం చేసుకున్న సంఘటనకు సంబంధించిన పత్రికా కథనాన్ని ప్రధాని మోడీ తన పోస్టుకు జతచేశారు.

ఈ కరెన్సీ నోట్ల గుట్టలను దేశ ప్రజలందరూ చూసిన తర్వాత నిజాయితీపై ఆ పార్టీ(కాంగ్రెస్) నాయకులు చెప్పే ఉపన్యాసాలను వినాలి. ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసా వాపసు చేయాల్సిందే. ఇది మోడీ గ్యారంటీ అంటూ వివిధ రకాల ఇమోజీలతో మోడీ హెచ్చరించారు. కరెన్సీ నోట్ల కట్టలతో నిండిపోయిన అనేక బీరువాల ఫోటోను కూడా ఆ పత్రికా కథనంలో పొందుపరిచారు.

కాగా..లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎక్స్ వేదికగా ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఎక్స్ అక్షర యుద్ధాన్ని ఉధృతం చేశారు. ఇటీవల జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న విచ్ఛిన్నకర కుట్రలపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా చురకలు అంటించారు. 70 ఏళ్ల అలవాట్లు అంత త్వరగా వదులుకోలేరంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News