Tuesday, May 7, 2024

బాన్సువాడలో ఓటు హక్కు వినియోగించుకున్న స్పీకర్‌ దంపతులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సందడి మొదలైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. బాన్సువాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూ లైన్ ద్వారా ఓటు వేశారు.

సాయంత్ర 5 గంటలకు వరకు పోలింగ్‌ కొనసాగనున్నది. సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరుగనున్నది. కాగా, ఎన్నికల అధికారులు ప్రజలు ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News