- Advertisement -
హైదరాబాద్: నగర శివారులోని నాగారం శిల్పానగర్ లో శుక్రవారం దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక పునరావస కేంద్రం పేరుతో ఓ సంస్థ వృద్ధులకు నరకం చూపిస్తోంది. నిర్వహకులు ఒకే గదిలో 50 మందికి పైగా వృద్ధులను ఉంచుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు విస్తుబోయే విషయాలు తెలిశాయి. గొలుసులతో కట్టేసి వృద్ధులను చిత్రహింసలు చేస్తున్నట్టు వెల్లడైంది. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆశ్రమనిర్వాహకులపై కేసు నమోదు చేేేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Police registered case against Mamata Old Age Home
- Advertisement -