- Advertisement -
కరీంనగర్ : ప్రశాంతంగా కొనసాగుతున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్. ఈ ఉదయం 7గంటలకు ప్రారభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 60 డివిజన్లలో 58 డివిజన్లలో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 60వ డివిజన్ లో తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 51వ డివిజన్ లో కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు కాగా, రెండు డివిజన్లలో టిఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవం అయ్యారు. 58 డివిజన్లకు 369 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 82 ప్రాంతాల్లో 337 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 11గంటల వరకు 25.11శాతం పోలింగ్ నమోదైంది. కాగా పోలింగ్ కేంద్రాల దగ్గర పకడ్బందీ ఏర్పాటు చేశారు అధికారులు.
Karimnagar Municipal Elections Polling
- Advertisement -