Monday, April 29, 2024

కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాకోర్టు ఓ అట్టర్ ఫ్లాప్ షో

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి బాహుబలి సెట్టింగ్ వేసి, పులకేశి సినిమా చూపించాడు
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన దాసోజు శ్రవణ్

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాకోర్టు ఓ అట్టర్ ప్లాప్ షో అని, రేవంత్ రెడ్డి బాహుబలి సెట్టింగ్ వేసి, పులకేశి సినిమా చూపించాడని బిఆర్‌ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తిరగబడటం తరిమికొడదాం అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన టి కాంగ్రెస్ అప్పుగే చతికిల బడిందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు లేని ఖాళీ కుర్చీల ప్రజాకోర్టు ఆసాంతం కెసిఆర్‌పై అక్కసుతో కడుపు మంటలు, కక్కుర్తి అరుపులు, ఊపిరితిత్తులు పగిలేలా ఊకదంపుడు ఉపన్యాసాలు, నిరాధారమైన ఆరోపణలతో సరిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై రేవంత్ కాంగ్రెస్‌కు నమ్మకం పోయిందా అని దాసోజు ప్రశ్నించారు. తిరగబడటం తరిమికొడదాం అనేది ప్రజాస్వామిక సిద్ధాంతమా..? లేక తెలంగాణ నయా నయీమ్ రేవంత్ తీవ్రవాదమా అని దాసోజు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కాంగ్రెస్ ఓట్ల పోరాటంలో ఉందా..? లేక తూటాల పోరాటంలో ఉందా అని ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రజలు మాకు ఓట్లు వెయ్యరని రేవంత్ కాంగ్రెస్ పార్టీ ముందే చేతులెత్తేసిందా..? అని ఆయన ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News