Monday, May 20, 2024

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హైదరాబాద్ పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్నారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళ సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. సిఎం కెసిఆర్ వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్, శంభీపూర్ రాజు, మేయర్ గద్వాల విజయలక్ష్మి,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజనీకుమార్, మేడ్చల్ కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, బిజెపి నేతలు తదితరులు ఉన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియ స్టేడియం లో నేటి మధ్యాహ్నం జరిగే అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ముగింపు ఉత్సవాలకు రాష్టప్రతితో కలిసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొననున్నారు.

Also Read: బండి సంజయ్ కు వంద కోట్లు ఎక్కడివి?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News