Saturday, May 4, 2024

గాంధీ నుంచి పరారైన ఖైదీ కేసులో పురోగతి

- Advertisement -
- Advertisement -

Progress in case of prisoner who escaped from Gandhi

మనతెలంగాణ/హైదరాబాద్ : గాంధీ హాస్పిటల్ నుంచి గతనెలలో తప్పించుకున్న నలుగురు ఖైదీలలో సోమ సుందర్ అనే వ్యక్తిని నార్త్ జోన్ పోలీసులు మంగళవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో పట్టుబడిన ఖైదీ నుంచి మిగిలిన ముగ్గురు నేరస్తుల సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. వివరాల ప్రకారం.. జావిద్, నరసింహా, సోమ సుందర్, ఆర్బాజ్ అనే నలుగురు ఖైదీలను గత నెలలో చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. అయితే అదును చూసుకొని అక్కడినుంచి తప్పించుకొని గుల్భర్గాకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ సైతం బైక్ చోరీలు చేద్దామని దుండగులు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు క్రితం కొట్టేసిన బైక్‌లతో సోమసుందర్ అనే నిందితుడు హైదరాబాద్‌కు చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుల్బర్గాలో మిగతా ఖైదీల కోసం ప్రత్యేక టీంలతో గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News