Wednesday, May 1, 2024

రాహుల్ గాంధీకి దమ్ము లేదు: రాజ్ నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

పఠనంథిట్ట(కేరళ):బిజెపి సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ గురువారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని విమర్శించారు. 2019 లో అమేథి లోక్ సభ సీటును ఓడిపోయాక అక్కడి నుంచి పోటీచేయడానికి రాహుల్ గాంధీకి ధైర్యం లేకుండా పోయిందన్నారు. ఓటమిని చవిచూసిన రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ నుంచి కేరళకు మైగ్రేట్ అయ్యారన్నారు.

‘‘ఏదిఏమైనప్పటికీ, వాయ్ నాడ్ ప్రజలు ఆయనను ఎంపీగా గెలిపించొద్దని నిర్ణయించుకున్నారని నేను విన్నాను’’ అని రాజ్ నాథ్ సింగ్ ఫఠనంథిట్ట లోక్ సభ నియోజకవర్గం ఎన్నికల సమావేశంలో అన్నారు. ఆయన బిజెపి అభ్యర్థి అనిల్ కె. ఆంథోనికి మద్దతుగా ప్రచారం చేస్తూ ఈ విషయాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News