Thursday, April 25, 2024

బంగ్లాను ఖాళీ చేసేందుకు సిద్ధం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ మెంబర్స్ సెక్షన్ బ్రాంచ్ కు రాహుల్ గాంధీ లేఖ..

న్యూఢిల్లీ: పార్లమెంట్ మెంబర్స్ సెక్షన్ బ్రాంచుకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. బంగ్లాను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అధికారికి బంగ్లా ఖాళీ చేయాలని నిన్న రాహుల్ గాంధీకు లోక్ సభ సచివాలయం లేఖ రాసింది. లోక్ సభ సచివాలయం చెప్పినట్లుగా వ్యవహరిస్తానని రాహల్ తెలిపారు. తుగ్లక్ రోడ్డులోని బంగ్లాను ఖాలీ చేసేందుకు సిద్ధం అన్నారు. నాలుగు సార్లు ఎంపిగా గెలిచిన నేను ప్రజల తీర్పున పాటిస్తానని ఆయన పేర్కొన్నారు. ఎంపిగా ఉన్నప్పుడు కేటాయించిన బంగ్లాతో ఎంతో అనుబంధం ఉందన్నారు. బంగ్లాతో ఉన్న తీపి గుర్తులు మరచిపోలేదనని రాహుల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News