Monday, April 29, 2024

హ్యాట్రిక్ సాధించిన రాజాసింగ్

- Advertisement -
- Advertisement -
బద్దం బాల్ రెడ్డి రికార్డుకు సమం

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ ఫలితాల్లో గోషామహల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ సాధించారు. బిఆర్‌ఎస్, ఎంఐఎం హవాను తట్టుకుని ఆయన మూడో సారి విజేతగా నిలిచారు. 2014 నుంచి గోషామహాల్ తన కంచుకోటగా మార్చుకున్న రాజాసింగ్ హైదరాబాద్ లో బిజెపి నుంచి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న టైగర్ బద్దం బాల్ రెడ్డి రికార్డులను సమం చేశాడు. గతంలో బద్దం బాల్ రెడ్డి ముస్లింలకు కంచుకోట అయిన కార్వాన్‌లో వరుసగా 1985, 1989, 1994 లో విజయం సాధించారు. తాజాగా రాజాసింగ్ ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ 2014, 2018, 2013 లో గెలిచి రికార్డు సాధించారు. ఈ ఎన్నికల్లో రాజాసింగ్ 21457 ఓట్లతో విజయం సాధించి హైదరాబాద్ జిల్లాలో బిజెపి తరఫున గెలిచిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News