- Advertisement -
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఆరంభంలో తడబడిన ముంబై ఇండియన్స్ జట్టు తిరిగి ఫామ్ని పుంజుకొని వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా గుజరాత్ టైటాన్స్ విజయంతో మంచి జోష్ మీద ఉంది. ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించి.. ప్లేఆఫ్స్ ఆశలను నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. హరసంగా స్థానంలో కుమార్ కార్తీకేయా. సందీప్ స్థానంలో మాధ్వల్ని జట్టులోకి తీసుకుంది. ముంబై ఇండియన్స్ ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది.
- Advertisement -