Monday, April 29, 2024

నిమ్స్‌లో వంద రోబోటిక్ సర్జరీలు విజయవంతం

- Advertisement -
- Advertisement -

పంజాగుట్ట : నిమ్స్ ఆస్పత్రిలో 100 రోబోటిక్ సర్జరీలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (35), యూరాలజీ(48), సర్జికల్ ఆంకాలజీ(17), విభాగాల వైద్యులు శుక్రవారం నాటికి 100 సర్జరీలను పూర్తి చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్ బీరప్ప గారికి నివేదికను ఇచ్చారు. ఆస్పత్రిలో రోబోటిక్ శస్త్ర చికిత్సలు గతేడాది జూలైలో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మూడు విభాగాల వైద్యులు అత్యంత సంక్లిష్టమైన చికిత్సలను పూర్తి చేశారు. అత్యంత క్లిష్టమైన సర్జరీ అయిన రోబోటిక్ సర్జరీలో కేవలం రంధ్రాలను వేసి చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పరికరాలతో పాటు, కెమెరా సర్జరీ చేసే వైద్యుడి నియంత్రణలోనే ఉంటుంది.

శరీరంలోని ఏ ప్రదేశాన్ని అయినా వైద్యుడు స్పష్టంగా చూసేందుకు వీలుంటుంది. ఈ ఆధునిక యంత్రాలతో అతి తక్కువ సమయంలోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. వైద్యులను అభినందించిన డైరెక్టర్ బీరప్ప గారు. అతి తక్కువ సమయంలోనే శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన యురాలజీ వైద్యలు ప్రొఫెసర్ రాహుల్ దేవ్ రాజ్ గారు, ప్రొఫెసర్ రాంరెడ్డి గారు, డా.విద్యాసాగర్ గారు, సర్జికల్ ఆంకాలజీ విభాగాధితి రాజశేఖర్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డా. వేణు మాధవ్, డా వర్మ, అనస్థీషియా ప్రొఫెసర్ నిర్మల మరియు నర్సింగ్ ఇతర సిబ్బందిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News